11-06-2025 12:21:04 AM
ఎల్బీనగర్, జూన్ 10 : మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యుడు వాకిటి శ్రీహరి సతీ సమేతంగా మంగళవారం కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానాన్ని సందర్శించి ధ్యానాంజనేయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా హనుమాన్ ఆలానికి వచ్చిన శ్రీహరికి ఆలయ ఈవో లావణ్య, వేద పండితులు, అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంత్రి దంపతులకు స్వామివారి శేష వస్త్రాలు అందజేసి, వేద పండితుల ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో ఈవో లావణ్య, ఆలయ చైర్మన్ ఈదులకంటి సత్యనారాయణ రెడ్డి, ధర్మకర్తలుపాల్గొన్నారు.