calender_icon.png 13 June, 2025 | 12:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు వస్తాయి

11-06-2025 06:20:09 PM

పార్టీ అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకుంటా..

టిపిసిసి ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): పార్టీ పటిష్ట వంతానికి అధిష్టానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బద్దం ఇంద్రకరణ్ రెడ్డి(State PCC President Baddam Indrakaran Reddy) తెలిపారు. బుధవారం కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి రావడానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(State Government Advisor Shabbir Ali) వచ్చిందన్నారు. తనకు రాష్ట్ర పార్టీకి సంబంధించిన బాధ్యతలు అప్పగించడం పట్ల విధేయతగా పనిచేయడమే కాకుండా పార్టీ పటిష్ట వంతానికి కృషి చేస్తానన్నారు.

ఏఐసిసి రాష్ట్ర ఇంచార్జ్ నాయకు రాలు మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుకు, జహిరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కార్, లకు కృతజ్ఞతలు తెలిపారు. నా పై నమ్మకంతో రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించినందుకు షబ్బీర్ అలీ సూచన మేరకు నడుచుకుంటాను అన్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లి పార్టీని మరింత పటిష్టవంతం చేస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేలా కృషి చేస్తానన్నారు. సమిష్టిగా ఉండి పార్టీ అభ్యర్థుల గెలుపుకు ఆ హార్నిశలు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బిబిపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుతారి రమేష్, మాచారెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు నౌసిలాల్ నాయక్, దోమకొండ మండల పార్టీ అధ్యక్షుడు అనంతరెడ్డి, రాజంపేట మండల పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి, దోమకొండ మాజీ జెడ్పిటిసి తీగల తీర్మల్ గౌడ్, మాజీ ఎంపీపీ బల్యాల రేఖ సుదర్శన్, గోనె శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్, పంపరి లక్ష్మణ్, మాజీ కౌన్సిలర్లు తేజాపు ప్రసాద్, కన్నయ్య, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దోమకొండ శ్రీనివాస్, లక్క పతిని గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.