26-06-2025 12:00:00 AM
-గత ప్రభుత్వంతో పోలిస్తే.. ఎక్కువ నిధులు.. తక్కువ సమయంలో జమ చేశాం
-డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకంలో భాగంగా కేవలం తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో 8.7 వేల కోట్లు జమ చేసిందని డిప్యూ టీ సీఎం మల్లు భట్టివిక్రమార్క బుధవారం ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన పెట్టబడి సా యాన్ని కూడా జమ చేశామన్నారు. నాడు యాసంగి సీజన్కు రూ.7,625 కోట్లు కేటాయించామని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం జమ చేసేందుకు ఒక్కో సీజన్కు 169 రోజుల సమయం తీసుకు న్నదని గుర్తుచేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చే నాటికి, తమపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం ఉందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. గత ప్రభుత్వానికంటే మరో రూ.2 వేలు కలిపి ఇవ్వాల్సిన సందర్భమని, అయినప్పటికీ రైతుల సంక్షే మం కోసం ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో పెట్టుబడి సాయంగా అందించిన నిధులు, సమయాలను.. రైతులు ప్రజాప్రభుత్వంతో బేరీజు వేసుకోవాలని, తద్వారా ఏ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ ఉందో రైతులకే అర్థమవుతుందన్నారు.