calender_icon.png 26 June, 2025 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకథే నా ఆత్మకథ‘ పుస్తకం అందించిన బండారు దత్తాత్రేయ

25-06-2025 11:36:17 PM

ఎంతో గర్వంగా భావిస్తున్నాను‘: ఆకుల మహేష్ కుమార్

సనత్ నగర్ (విజయక్రాంతి): హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ(Haryana Governor Bandaru Dattatreya) స్వయంగా రచించిన ‘ప్రజలకథే నా ఆత్మకథ‘ అనే పుస్తకాన్ని, తన నివాసంలో తన సంతకంతో నాకు అందించడం, నా జీవితంలో ఒక గౌరవనీయమైన, స్మరణీయ ఘట్టంగా భావిస్తున్నాను అని భారతీయ జనతా పార్టీ సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ ఆకుల మహేష్ కుమార్ పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఆయన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం, ప్రజల పట్ల ఉన్న అపారమైన సేవా దృక్పథం, వ్యక్తిగతంగా ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాల గురించి విశ్లేషణాత్మకంగా వివరించబడ్డాయి. ‘ఈ పుస్తకాన్ని చదివిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతలో దేశసేవ పట్ల నిబద్ధత పెరిగి, ప్రజల పట్ల ప్రేమాభిమానాలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. రాజకీయ శ్రేయోభిలాషులు మరియు సామాన్య పాఠకులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది,‘ అని ఆకుల మహేష్ కుమార్ గారు తెలిపారు.ఈ సంఘటన తనకు మరింత బాధ్యతను, ప్రేరణను కలిగించిందని పేర్కొంటూ, ‘ఇలాంటి గొప్ప నాయకుని నుండి స్వయంగా పుస్తకాన్ని అందుకోవడం నా జీవితానికే గౌరవంగా భావిస్తున్నాను‘ అని భావోద్వేగంతో తెలిపారు.