calender_icon.png 18 May, 2025 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓవర్ టెక్ చేసే క్రమంలో ఢీకొన్న మూడు లారీలు

19-03-2025 01:25:59 PM

గుడిహత్నూర్, (విజయక్రాంతి): ఓవర్ టెక్ చేసే క్రమంలో మూడు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు డ్రైవర్ లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం బుధవారం ఇచ్చోడ నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న మూడు లారీలు ఓవర్ టెక్ చేసే క్రమంలో వెనుక నుంచి ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ క్లీనర్ క్యాబిన్ లో చిక్కుకోగా స్థానికులు బయట తీశారు. మరో ఇద్దరు డ్రైవర్లకు కళ్ళు విరుగాయి. గాయపడ్డ వారిని రిమ్స్ కు తరలించారు.