మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!
- ఓటీఎస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 320 కోట్ల ఆదాయం
- ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించే అవకాశం
- ఓటీఎస్ స్కీమ్ ను అందరూ వాడుకోవాలి: జీహెచ్ఎంసీ కమిషనర్
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుకు సంబంధించి వివరాలను సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్(GHMC Commissioner RV Karnan ) వివరించారు. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు ఆస్తి పన్ను వడ్డీపై రాయితీతో చెల్లించాలని కోరారు.
ఓటీఎస్ స్కీమ్(OTS Scheme) ను అందరూ వాడుకోవాలని పిలుపునిచ్చారు. 28 లక్షల ఆస్తి పన్నుల్లో 18 లక్షల మంది ఆస్తి పన్నులు చెల్లించారని, ఇప్పటి వరకు రూ. 2,186 కోట్ల ఆస్తి పన్ను వసూలు అయ్యాయని పేర్కొన్నారు. ఓటీఎస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టబోతున్నమన్న ఆయన పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. మెగా ఈ-వేస్ట్ డ్రైవ్(Mega E-waste Drive) చెపట్టామని కమిషనర్ పేర్కొన్నారు.




