17 July, 2026 | 9:02 PM

Breaking News

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్   •   రోగుల సేవలకు మరింత బలం   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ నైపుణ్యాలతో ఉపాధి పెరుగుతుంది   •   సిరిసిల్ల అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిందేమీ లేదు: సీపీఎం నేత ఎం.డి. అబ్బాస్   •   విద్యార్థినుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   తరగతి గది దాటిన చిన్నారుల బాధ్యత   •   భార్య కాపురానికి రానని నిరాకరించడంతో భర్త బలవన్మరణం   •   మంథనికి ‘న్యాక్’ అంతర్జాతీయ స్కిల్ సెంటర్: మంత్రి శ్రీధర్ బాబు   •   నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా మహాలక్ష్మి బోనాల పండుగ   •   పటేల్‌కుంట చెరువుకు సుందరీకరణ పనులు త్వరలో చేపడతాం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి   •  

'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ. రూ.5.62 లక్షల ఫైన్

17-07-2026 09:02 PM

- ముగ్గురికి 10 రోజులు జైలు శిక్ష 

సిద్దిపేట క్రైం: సిద్దిపేట పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 55 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సీహెచ్ ముత్యంరాజు తెలిపారు. వారిని శుక్రవారం సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచినట్టు పేర్కొన్నారు. వారిలో 51 మందికి రూ.5లక్షల 62 వేలు జరిమానా, ముగ్గురికి 10 రోజులు, ఒకరికి 5 రోజులు జైలు శిక్ష విధించారని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన 28 మందికి ఒక్కొక్కరికి రూ.5వేల చొప్పున రూ.లక్షా 40 వేలు జరిమానా విధించారని పేర్కొన్నారు.