3 June, 2026 | 1:34 AM

చివరిదాకా ఉత్కంఠభరితంగా..

03-06-2026 01:04 AM

అమెరికన్ నటి జో శర్మ, సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించగా.. దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్) మే 8న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. నటించిన ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం జూన్ 19 నుంచి లయన్స్‌గేట్ ప్లే, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్, జియోటీవీ, టాటా ప్లే బింజ్ తదితర ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది. అనూహ్యమైన మలుపులు, ఉత్కంఠభరితమైన కథనం, బలమైన స్క్రీన్‌ప్లేతో చివరి క్షణం వరకు అసలు హంతకుడు ఎవరో ప్రేక్షకులను ఊహాగానాల్లో ముంచెత్తారు.   ముఖ్యంగా ఇందులో హీరోయిన్ జో శర్మ ఇన్వెస్టిగే టివ్ జర్నలిస్ట్ రాధ పాత్రలో ఆకట్టుకుంటున్నారని మేకర్స్ తెలిపారు.