02-05-2025 12:00:00 AM
జగత్తులు ఎలాగైతే విభాగాలుగా విస్తరించి ఉన్నాయో, మనుషులు ఏ విధంగా బృందాలుగా విడివడి జీవిస్తున్నారో అదే పద్ధతిలో జగద్గురువులు పలువురు వుండటం వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు.
నేడు ఆదిశంకరాచార్య, రామానుజాచార్యుల జయంతి
జగత్తు లేదా విశ్వం మొత్తం శూ న్యం నుంచి పుట్టి, ఒకేచోట, ఒక్కటిగా కాక అనేక విభాగాలుగా ఉన్నట్టుగా నే.. సనాతన భారతీయ ఆధ్యాత్మిక జ్ఞా నం ప్రకారం దైవశక్తి కూడా ప్రధానంగా ఒక్క టే అయినా బహురూపాలుగా దర్శనమి స్తూ వుంటుంది. ఇతర మతాలకు, వైదిక మతానికి మధ్య వున్న ప్రధాన వ్యత్యాసాలలో ఇదొకటి. మన మార్గాలు, వాహ కాలు వేరైనా అంతిమ లక్ష్యం మాత్రం ఒక్కటే కనుక ఈ తేడాను పట్టించుకోవలసిన పనిలేదు. అయినా, కొందరు దీనినే టార్గెట్గా చేసుకుని సనాతన ధర్మాన్ని విమర్శించడం పరిపాటిగా మారింది.
ఇటీవల “జగద్గురువు ఒక్కరే ఉండాలి కదా, ఇందరు ఎలా ఉంటారు?” అన్న అవాంఛనీయ ప్రస్తావన ఒకటి శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారివల్ల ఉద్భవించింది. చర్చను ఆయన మరింత లోతుల్లోకి తీసుకెళ్లి “రామానుజుల వారే నిజమైన ఏకైక జగద్గురువు” అన్నట్టుగా ఉపన్యసించిన వీడియో ఒకటి వైరల్ అయింది. ఆయన ప్రత్యేకించి ఆదిశంకరుల గురుపరంపరను దృష్టిలో పెట్టుకుని అలా విమ ర్శించినట్టు కూడా సోషల్ మీడియాలో వ్యాప్తి చెందింది. ఇది అనేకమంది అద్వైత భావజాలం గలవారిని, మరీ ముఖ్యంగా ఆదిశంకరాచార్యుల ప్రియభక్తులను గాయపరిచింది. వాళ్లలో కొందరు ప్రముఖులు బహిరంగంగానే స్పందిస్తూ, మేధో చర్చకు తాము సిద్ధమని కూడా కోరారు. కానీ, ఇక్కడితో విషయం ఆగిపోయింది. జగత్తులు ఎలాగైతే విభాగాలుగా విస్తరించి ఉన్నాయో, మనుషులు ఏ విధంగా బృం దాలుగా విడివడి జీవిస్తున్నారో అదే పద్ధతిలో జగద్గురువులు పలువురు వుండటం వల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. ఎవరికి వాళ్ళు తమ గురువే గొప్పవారు, ఇతరుల గురువులు తక్కువ అనుకోవడం అజ్ఞానం.
భారతీయ త్రిమతాచార్యులుగా ప్రసిద్ధి చెందిన వారిలో మొదటి ఇరువురు జగద్గురువుల జయంతి ఇవాళే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆదిశంకరులు, రామానుజుల జీవిత విశేషాలను, వారి సైద్ధాంతిక దృక్పథాలను సూక్ష్మంగా తెలుసుకుందాం.
దైవం మానవ రూపంలో..
దైవం మానవ రూపంలో అన్నట్టు జగత్తులో పుట్టే ప్రతీ జీవాంశ దేవుని పర మాంశ నుంచే ఉద్భవించిందని చెప్పేదే అద్వైతం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మ నిషిలోనూ, ఇంకా సృష్టి అణువణువునా దేవుడు ఉన్నాడు. విశ్వజనీనమైన ఈ సూత్రం ఆధారంగానే ఆదిశంకరులు భారతీయ సనాతన వైదిక మతం కాలగర్భంలో కలిసి పోకుండా పునరుద్ధరించగలిగారు. భారతీయ తత్త్వశాస్త్ర వినీలాకాశంలో ఒక ధ్రువతారగా ఆయన ప్రకాశిస్తున్నారు. వేదాలనే ప్రమాణంగా తన ప్రతిభా విశేషాలతో, వాదనా పటిమతో, కార్యదీక్షతో అనేక అద్భుతాలు సృష్టించారు. వైదిక ధర్మం ఎంత అద్వైత భరితమో శాస్త్ర ప్రామాణికంగా నిరూపించారు.
కేరళ రాష్ట్రంలోని పూర్ణానదీ తీరంలోగల ‘కాలటి’ అనే గ్రామంలో (నేటి కాలడి) నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో క్రీ.శ. 788లో వైశాఖ శుద్ధ పంచమి నాడు శంకరులు జన్మించారు. ఆయన ఎప్పుడు జన్మించారు, ఎప్పుడు ఎక్కడ ఎలా సిద్ధి పొందారనే విషయాలు వివాదగ్రస్తమైనా చాలామంది పండితులు ఆమోదించిన జీవిత కాలం క్రీ.శ. 788 పార్వతీదేవి సుబ్రహ్మణ్యస్వామికి ఏ విధంగా జన్మనిచ్చిందో అలాగే ఆర్యమాంబ శంకరులకు జన్మనిచ్చినట్టు చెప్తారు. ఇంకా ఆ రోజు, ఆ సమయంలో శివుని జన్మనక్షత్రమైన ఆరుద్రలో సూర్యుడు, శని, గురువు, కుజుడు ఉచ్ఛస్థితులలో ఉన్నట్టుకూడా జ్యోతిషవేత్తలు అంటారు. శృంగేరి శంకర మఠం వారి ప్రకారం క్రీ.శ. (సా.శ.) 788 లో జన్మించినట్లు చెబుతుండగా, కంచి మ ఠం వారి ప్రకారం రెండు వేల సంవత్సరాలకిందట క్రీ.పూ.509లో జన్మించినట్లు చెప్తారు. తండ్రి శివగురువు మహాపండితు డు. వారి అనన్య శివభక్తి మూలంగానే శి వాంశతో శంకర భగవత్పాదులు జన్మించినట్లు అందరూ నమ్ముతారు. తండ్రి ఆయ నకు ‘శంకరుడు’గా నామకరణం చేశారు.
ఆనాటి కాలంలో హిందూమతం తీవ్ర విపత్కర పరిస్థితులలో ఉంది. ఒక గొప్ప కారణజన్ముల వలె శంకరులు ఎదిగారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. తల్లి పెంపకంలో ఉండగానే ఆమె అనుమతితో సన్యాస దీక్షకు సిద్ధమయ్యారు. వ్యాసుని కుమారుడైన శుకుని శిష్యులు గౌడపాదులు కాగా, ఆయన శిష్యుడే శంకరులకు గురువు అయ్యారు.
ఆనాటికే వేద ప్రామాణ్యాన్ని, ఆచార సంప్రదాయాలు, మొత్తంగా వర్ణవ్యవస్థను తిరస్కరిస్తూ నాస్తికత్వాన్ని ప్రవేశపెట్టిన బౌ ద్ధ, జైన మతాలు ప్రబలంగా వ్యాపించి, హిందూమతాన్ని బలహీన పరుస్తున్నా యి. దీనికి తోడు చార్వాకుని భౌతిక నాస్తిక వాదం కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. ప్రజలు కర్మకాండకు ఇచ్చే ప్రాధా న్యం, జ్ఞానసముపార్జనకు ఇవ్వడం లేదు. సరికదా కాపాలికాది దుష్ట సంప్రదాయా లు, మూఢ నమ్మకాలు కూడా ప్రబలాయి. ఈ పరిస్థితులలో శంకరులు భౌతిక, నాస్తిక వాదాలను ఖండించడమే కాక హిందూమతాన్ని సంస్కరించి అద్వైత భావంతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమార్గంలోకి నడిపించారు. పై సవాళ్ళను ఎదిరిస్తూ, కార్యోన్ముఖుడై దేశం నలుమూలలా నాలుగు మఠాలను స్థాపించారు.
జీవునికి, దేవునికి మధ్య..
అద్వైతం మనిషిని దేవుణ్ణి చేసేసరికి చాలామందిలోకి అహం ప్రవేశించింది. ‘అహం బ్రహ్మాస్మి’ అయ్యాక ఇంకా దైవభక్తితో పనేముంది? అనే దగ్గరికి వచ్చేశారు. ఒక శుచి శుభ్రత, పవిత్రత, భక్తి అన్నవేవీ లేకుండా పోయాయి. సదాచార సంప్రదాయాలు అడుగంటాయి. మొత్తంగా భక్తినే వదిలేసే స్థితి సంభవించింది. దీనికితోడు శంకరులు కాలధర్మం చెందిన శతాబ్దాల తర్వాత, మారిన పరిస్థితులతో అప్పటికి అన్యమతాలతో ప్రత్యేకించి ముస్లిం, క్రైస్తవ వర్గాలతో మళ్ళీ వైదిక మతానికి తీవ్రముప్పు ఏర్పడింది.
ఈ నేపథ్యంలోనే ఒక కారణజన్ములవలె శ్రీరామానుజుల వారు జన్మించారు. అద్వైతాన్ని మరింత లోతుగా పదును పెట్టారు. “గుడి అందరిదీ. గుడిలో ని దేవుడు అందరివాడు. కానీ, దేవుణ్ణి చే రుకోడానికి మనకు భక్తి అనే మార్గం తప్పనిసరి” అన్నారు. నిజానికి రామానుజులు జీవపరమాత్మల భేదాన్ని చూపవలసిన అగత్యం ఇందువల్లనే ఏర్పడింది. మార్గా లు వేరైనా శంకరులు, రామానుజులు అంతిమంగా సనాతన వేదాల సారాన్నే ప్రామా ణికంగా ప్రజలకు చేరువ చేశారు.
దేవుడిని పూజించటం, మోక్షాన్ని సా ధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కుగా రామానుజులు ప్రకటించారు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికీ లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. పరస్పరం వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం అవుతుంది. అద్వైతానికి కొనసాగింపుగా ఈ విశిష్ఠ తత్వానికి ఆయన జీవం పోశారు. విశిష్టాద్వైత తత్వంతో భారతీయ అధ్యాత్మికతకు అద్భుత రీతిలో భక్తి ఉద్యమాన్ని వ్యాపింపచేసిన ఘనత శ్రీరామానుజుల వారిది.
శ్రీరామానుజుల జీవితకాలం క్రీ.శ. 10౭7 మధ్య ఉండవచ్చని చరిత్రకారులు అంచనా వేశారు. ఆయన క్రీ.శ. 10౭7లో శ్రీపెరంబుదూరుగా ఇప్పుడు పేరున్న భూతపురిలో జన్మించారు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కి.విూ. దూరంలో ఉంది. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం శంకరుల జయం తి రోజే వీరుకూడా జన్మించినట్లు చెప్తారు.
ఎంతో శక్తివంతమైన ‘తిరు (నారాయణ) మంత్రాన్ని’ అందరికీ వినపడేలా ప్రకటించారు. పరమ పవిత్రమైన ఈ మం త్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించవద్దనీ, దీనిని విన్నంతనే ముక్తి కలుగుతుం దనీ గురువు నంబి చెప్పారు. “నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తేనేమి, అం దరికీ ముక్తి కలుగుతుంది గదా!” అనే ఉదార భావనతో ఆయన గుడి గోపురం ఎక్కి దానిని అందరూ వినేలా చదివారు. సనాతన భారతీయ ధార్మిక జీవన విధానాన్ని కాలానికి తగ్గట్టు సామాన్యులవద్దకు చేర్చడంలో అటు శంకరులు, ఇటు రామానుజులు తమ విలువై న జీవితాలను ధార పోసి కోట్లాదిమందికి మార్గదర్శకమైనారు.
-గడీల ఛత్రపతి