calender_icon.png 3 May, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం

03-05-2025 09:01:47 AM

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో(Tirumala Tirupati Devasthanams) భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి(Tirumala darshan waiting time) 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. 74,344 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 32,169 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.5 కోట్లు వచ్చినట్లు టీటీడీ(TTD) ప్రకటించింది. అటు శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ఫీడ్ బ్యాక్ విధానం అందుబాటులోకి తీసుకువచ్చింది.