01-05-2025 08:48:51 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనాకికి(Tirumala Sarvadarshanam) 12 గంటల సమయంలో పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 66,616 మంది భక్తులు నిన్న తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. 27,837 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.95 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది.