డీఈఓ అశోక్
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు కృషి చేయాలని డీఈఓ అశోక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో ఏర్పాటు చేసిన రోబోటిక్ ప్రోగ్రామింగ్ ఎలక్ట్రానిక్ కోడింగ్ సమ్మర్ క్యాంపును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ క్రింద ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో రోబోటిక్స్, డ్రోన్లు వినియోగిస్తున్నారని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు టెక్నాలజీ మీద నైపుణ్యం పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షకుడు సాయికుమార్, పాఠశాల హెచ్ఎం గుండేటి కోటేశ్వర్రావు, బోనగిరి సతీష్బాబు, వేణుగోపాల్, దేవభూషణం, ఉదయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.