'కవిత పాంచజన్యం'.. ఐదు కీలక హామీలు ఇవే..!
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం తన కొత్త పార్టీని ప్రకటించారు. ఆ పార్టీ పేరును 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS)గా పేర్కొన్నారు. మేడ్చల్లోని మునిరాబాద్లో ఉన్న ఒక కన్వెన్షన్ సెంటర్లో కవిత ఈ ప్రకటన చేశారు. పార్టీ పేరును ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన పలువురు నాయకులు విచ్చేశారు. ఈ సమావేశంలో కవిత పార్టీని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పాంచజన్యం పేరుతో కవిత ఐదు హామీలు ప్రకటించారు.
1. విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.
2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.
3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.
4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.
5. సామాజిక న్యాయం సాధించాల్సిందే.






