13-06-2025 12:27:23 AM
విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి లక్ష రూపాయల విరాళం
కామారెడ్డి టౌన్, జూన్ 11 (విజయ క్రాంతి): దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ,ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అందుకే వారి సంక్షేమానికి భారత దేశ పౌరునిగా చేయూత నందిస్తూ,
వారికి సంఘీభావము తెలుపుతూ సాయుధ దళాల పతాక నిధికి లక్ష రూపాయల చెక్కును కె.క్రిష్ణ మూర్తి శర్మ, విద్యుత్ శాఖ విశ్రాంత ఉద్యోగి కామారెడ్డి వాస్తవ్యులు ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లాల అధికారి అయిన డి.రమేష్ గారికి అందజేసినారు. తదుపరి ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి గారు కె.క్రిష్ణ మూర్తి శర్మ ను శాలువతో సత్కరించి అభినందించారు.
కె.క్రిష్ణ మూర్తి శర్మ ను స్పూర్తిగా తీసుకొని కామారెడ్డి మరియు నిజామాబాద్ జిల్లాల నుండి వ్యాపారస్తులు ముందదుకు రావవాలన్నారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి శ్రీ.డి.రమేష్ మరియు కార్యాలయ సిబ్బంది, బదాం గంగామోహన్, ఉమేర్ పాల్గోన్నారు.