21 April, 2026 | 5:39 PM

Breaking News

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్   •   అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం   •   బస్సు ఢీకొని వ్యక్తి మృతి   •   గోవులను నదులతో సమానంగా గౌరవించాలి   •   విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలి - కలెక్టర్ చాహత్ బాజ్ పాయి   •   కొడుకుతో కలిసి కట్టుకున్నోడినే కడతేర్చిన భార్య   •   రేవంత్ స్థాయి ఏంటో ప్రజలకు అర్థమైంది.. కాంగ్రెస్ మళ్లీ గెలవదు!   •   ప్రజల దాహార్థి తీర్చడమే లక్ష్యం: సర్పంచ్ హీరాలాల్   •   మంచి చేయాలని సంకల్పం మనసులో ఉండాలి   •   డా. బీ.ఆర్ అంబేద్కర్ ఎక్సలేన్స్ 2026 అవార్డును అందుకున్న అచ్చమ్మకుంట తండా కుర్రాడు నేనావత్ అనిల్ కుమార్   •  

చరిత్రలో నేడు

13-04-2025 12:09 AM

జలియన్ వాలాబాగ్ ఊచకోత..

1919 ఏప్రిల్  13న పంజాబ్‌లోని జలియన్‌వాలాబాగ్‌లో సమావేశమైన భారతీయ ఉద్యమకారులపై బ్రిగేడియర్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలోని బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో సుమారు 379 మంది మరణించారు. 1,200 మంది గాయపడ్డారు. 

అపోలో మిషన్

1970లో జరిగిన అపోలో-13 మిషన్. ఇది చంద్రుని దగ్గరకు వెళ్తున్న సమయంలో ఆక్సిజన్ ట్యాంక్ పేలిపోవడంతో ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ.. వ్యోమగాములు సురక్షితంగా తిరిగి వచ్చారు. అందుకే దీన్ని విజయవంతమైన వైఫల్యంగా నాసా పేర్కొంది. 

అమెరికాలో అడుగుపెట్టిన ఏనుగు

1796 ఏప్రిల్ 13న మన దేశం నుంచి పంపించిన ఏనుగు అమెరికాను చేరింది. అంతవరకు అమెరికన్లు ఏనుగును చూడలేదు. ఏనుగును చూడటం అదే మొదటిసారి.