31-05-2025 12:46:36 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కొత్తపల్లి, మే 30 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రం పంచాదశ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైంది. జూన్ 1న వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 4 .30గంటలకు శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు జగద్గురువుల కరకములచే పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్య హవచనము, గణపతి పూజ, అ ఖండ దీపారాధనము, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర సహిత చండీ హోమము, పూర్ణాహుతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, జగద్గురువుల అనుగ్రహ భాషణం, అనంతరం అన్న ప్రసాద వినియోగం చేపట్టనున్నారు.
ఈ వేడుకలకు హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.