calender_icon.png 2 June, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు మహాశక్తి దేవాలయ పంచాదశ వార్షికోత్సవం

31-05-2025 12:46:36 AM

  1. పాల్గొననున్న హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి,

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ 

కొత్తపల్లి, మే 30 (విజయ క్రాంతి): కరీంనగర్ పట్టణం చైతన్యపురిలోని మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రం పంచాదశ  వార్షికోత్సవ వేడుకలకు  ముస్తాబైంది.  జూన్ 1న వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఆలయ నిర్వహకులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉదయం 4 .30గంటలకు శ్రీలక్ష్మీ గణపతి, శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లకు జగద్గురువుల కరకములచే పంచామృతాభిషేకం, ఉదయం 8 గంటలకు స్వస్తి పుణ్య హవచనము, గణపతి పూజ, అ ఖండ దీపారాధనము, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమము, రుద్ర సహిత చండీ హోమము, పూర్ణాహుతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వినియోగం, జగద్గురువుల అనుగ్రహ భాషణం, అనంతరం అన్న ప్రసాద వినియోగం చేపట్టనున్నారు.

ఈ  వేడుకలకు హంపి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ హాజరుకానున్నారు.  భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లకు కృపకు పాత్రులు కాగలరని ఆలయ నిర్వాహకులు కోరారు.