31-05-2025 12:48:33 AM
కొత్తకోట మే 30 : వేగంగా వస్తున్నాకారు ఎదురుగ వస్తున్న మోటర్ సైకిల్ ను బలంగా డీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి కొత్తకోటలో జ రిగింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట మున్సి పాలిటీ కేంద్రానికి చెందిన దాసరి బాలరాజు (25) చేపలు పట్టుకొని జీవనం గడిపేవాడు. అయితే గురువారం రాత్రి కానాయపల్లి గ్రా మ చెరువులో చేపలు పట్టడానికి మోటార్ సైకిల్ పై బయలుదేరాడు.
స్థానిక బిపిఆర్ గార్డెన్ సమీపంలో వెళ్తుండగా వనపర్తి నుం డి కొత్తకోటకు వస్తున్నా కారు మోటర్ సైకి ల్ ను బలంగా ఢీ కొట్టింది. మోటర్ సైకిల్ పై ఉన్న వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందారు. విష యం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని హాస్పిటల్ కు తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.