దంచికొట్టిన వాన
పలుచోట్ల నేలకొరిగిన చెట్లు
రోడ్లపై నిలిచిన నీరు
భారీ ట్రాఫిక్ జామ్తో వాహనదారులకు ఇక్కట్లు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రుతుపవనాల ప్రభావంతో నగరంలో ఆదివారం మధ్యాహ్నం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చంపాపేట్, సైదాబాద్, చాదర్ఘాట్, మలక్పేట్, ఎస్సార్ నగర్, బోరబండ, పంజాగుట్ట, వనస్థలిపురం, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వాన పడింది. భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల చెట్టు నేలకొరిగాయి.
రహదారులపై భారీగా వర్షం నీరు నిలిచింది. దీంతో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలి గింది. పలుచోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. చార్మినార్ మండలంలోని డబీర్పురలో అత్యధి కంగా 71.8 మిల్లీ మీటర్లు, హిమాయత్ నగర్లోని విటల్వాడిలో అత్యల్పంగా 40.5 మి.మీ వర్షపాతం నమోదైంది. మెహదీపట్నంలో విద్యుత్ స్తంభంపై చెట్టు విరిగిప డడంతో స్తంభం విరిగిపడింది. ఎర్రగడ్డలో కరెంట్ తీగలపై ఓ భారీ వృక్షం విరిగిపడింది.






