6 May, 2026 | 11:24 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు కృషి

24-06-2024 12:05 AM
  1. మంత్రి శ్రీధర్ బాబు

ఎస్సార్ నగర్‌లో జయంతి సూపర్ స్పెషాలిటీ  ఆసుపత్రి ప్రారంభం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 23 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఎస్సార్ నగర్‌లోని జయంతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్య తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులు ప్రభుత్వానికి సహకరించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచామని, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు తక్కువ ధరల్లో వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.