4 May, 2026 | 4:18 AM

నాగర్‌కర్నూల్ జిల్లాలో విషాదం

04-05-2026 03:01 AM

కల్తీ కల్లు తాగి మహిళ మృతి చెందినట్లు దుకాణం ముందు ఆందోళన 

నాగర్ కర్నూల్ మే 3 (విజయక్రాంతి) నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని చెంచు కాలనిలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెంచు మహిళ మంగమ్మ(48) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకోగా ఆమె కల్తీ కల్లు తాగడం వల్లే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని కల్లు దుకాణం ముందు ట్రాక్టర్లో ఉంచి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు.

కల్లు దుకాణం యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ఈ సందర్భంగా యజమానిని వెంబడించగా, ప్రాణభయంతో అతను సమీప పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు.ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. మంగమ్మ మృతికి గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.