పరీక్షల వేల ప్రయాణికుల ఇక్కట్లు..!
అరకొరా ఆర్టీసీ బస్సులు
నాగర్ కర్నూల్ మే 3 (విజయక్రాంతి)ఓ పక్క పెళ్లిళ్లు, మరోపక్క గురుకులం, నీట్ ప్రవేశ పరీక్షల వేల ఆర్టీసీ అధికారులు ఆయా రూట్లో సరిపడా బస్సులను ఏర్పా టు చేయకపోవడంతో ప్రయాణికులు వి ద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తక్కువ సంఖ్యలో బస్సులు నడప డంతో ఒక్కో బస్సు కోసం వందల మంది ప్రయాణికులు ఎగబడుతూ కనిపించారు. నీట్ ప్రవేశ పరీక్షతోపాటు గురుకుల ప్రవేశ పరీక్షలు, అధిక సంఖ్యలో పెళ్లిళ్లు కూడా ఒకే రోజు కలిసి రావడంతో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల వెంట ఎగబడ్డారు.
ఆదివారం సెలవు దినం, మైసమ్మ జాతర వంటివి ఉన్నప్పటికీ ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని రూట్లల్లో ఆర్టీసీ బస్సులు నడపకపోయినా ఖాళీగా ఉన్నప్పటికీ పరిమితికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నప్పటికీ తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరుగుతుందో నన్న భయంతో ప్రయాణించారని ప్రయాణికులు వాపోయారు.






