16-06-2025 10:41:29 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రతిష్టాత్మకమైన కురవి వీరభద్ర స్వామిని టిపిసిసి క్యాంపెనింగ్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్(TPCC Campaign Committee Chairman Madhu Yashki Goud), కాంగ్రెస్ ఆదివాసి జాతీయ నేత బాలయ్య నాయక్ తో కలిసి సోమవారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు మధుయాష్కి గౌడ్, బాలయ్య నాయక్ ను ఆశీర్వదించారు. అనంతరం మహబూబాబాద్, కేసముద్రంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వరంగల్ జిల్లా చెన్నారావుపేటకు వెళ్లారు. మధు యాష్కి గౌడ్ కు టిపిసిసి ఓబీసీ సెల్ చైర్మన్ మేకల వీరన్న యాదవ్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.