ఉపాధ్యాయుల బదిలీలు..
29-06-2024 12:33 AM
పదోన్నతులకు కోర్టు గ్రీన్ సిగ్నల్
షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ
రంగారెడ్డి, జూన్ 28 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీ లు, పదోన్నతులకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ జిల్లాలో నిలిచిన పదోన్నతులు, బదిలీలకు శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ౮ రోజుల్లో ౩ దశల్లో ప్రక్రియ పూర్తి చేయనున్నది. మొదటి దశలో స్కూల్ అసిస్టెంట్ బదిలీలు, రెండో దశలో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతి, మూడో దశలో ఎస్జీటీలు బదిలీలతోపాటు అప్గ్రేడ్ అయిన పండితులు, పీఈటీలకు పదోన్నతులు ఇవ్వనున్నది. 2023 అక్టోబర్లో ఆగిపోయిన బదిలీలు పూర్తవుతుండంతో ఉపాధ్యాయులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.




