9 April, 2026 | 4:50 PM

Breaking News

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •   పొంగులేటి కాదు— పొంగు'లూటీ'   •   గడి మైసమ్మకు మున్సిపల్ కార్మికుల బోనాలు   •   రైతులు గోదాములను సద్వినియోగం చేసుకోవాలి   •   22, 24వ వార్డుల్లో పోషక పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   పొంగులేటిపై చర్చకు సిద్ధం— హరీష్ ఆధారాలతో రావాలి— టీపీసీసీ చీఫ్ సవాల్   •   కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు: శశిథరూర్‌   •  

రూ.18 లక్షలతో కారు డ్రైవర్ పరార్

29-06-2024 12:34 AM

జగిత్యాల, జూన్ 28 (విజయక్రాంతి): కారులో ఉంచిన రూ.18 లక్షల డబ్బుతో ఓ డ్రైవర్ ఉడాయించిన ఘటన జగిత్యాలలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగిత్యాల టౌన్  సీఐ వేణుగోపాల్  కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన చైల్‌సింగ్ ఓ ఎలక్ట్రికల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్. రాష్ట్రవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేసి నెలనెలా డబ్బులు వసూలు చేసుకుంటారు. ఆయన వద్ద దయాసింగ్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తునాడు. శుక్రవారం జగిత్యాలకు వచ్చిన చైల్‌సింగ్.. కారును పార్క్ వద్ద ఉంచి అప్పటికే కలెక్షన్ చేసిన రూ.18 లక్షలు డ్రైవర్‌కు ఇచ్చాడు. పట్టణంలో డబ్బుల వసూలు కోసం వెళ్లి వచ్చే సరికి దయాసింగ్ రూ.౧౮ లక్షలతో పరారయ్యాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.