17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గాలివాన బీభత్సానికి నేలకొరిగిన చెట్లు

15-04-2025 12:00 AM

వరి, మామిడి రైతులకు నష్టం

కోదాడ, ఏప్రిల్ 14: నియోజకవర్గంలో ఆదివారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు విద్యుత్ స్తంభాలు చాలా వరకు నేలకొరిగాయి. ఇప్పటికే అనేక కారణాలతో దిగుబడి తగ్గి తీవ్రంగా నష్టపోతున్న మామిడి రైతుకు ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు మామిడికాయ పంట పూర్తిగా నేల రాలడమే కాకుండా మామిడి చెట్లు వేళ్లతో సహా నేలకు ఒరిగాయి.

వరి వేసిన రైతులు తీరా కోతకు వచ్చిన సమయంలో పైరు మొత్తం నేలకొరిగింది. పంట చేతికి వచ్చే దశలో రైతులకు తీరని నష్టం జరిగింది. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. నల్లబండగూడెం, కాపుగల్లు, కూచిపూడి, తొగర్రాయితో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరి, మామిడి పంట నష్టం జరిగింది.