04-06-2025 12:53:15 AM
గుహవాటి, జూన్ 3: ఈశాన్య రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎన్న డూ లేనంతగా భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి. ఒకవైపు కొండచరియ లు విరిగి పడుతుండటం.. మరోవైపు వరదలు ముంచెత్తడంతో జనజీవనం స్తంభిం చి పోయింది. వర్షాలు, వరదల ధాటికి ఈశా న్య రాష్ట్రాల్లో 36 మంది మృత్యువాత చెం దగా.. దాదాపు 5.5 లక్షల మంది రోడ్డు న పడ్డారు.
ముఖ్యంగా అస్సాం, సిక్కిం, త్రిపు ర రాష్ట్రాలు భారీ వర్షాలతో తడిసిముద్దవుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడి రవాణా మార్గాలు దెబ్బ తింటున్నాయి. మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లోనూ వానలు దంచికొడుతుండటంతో చా లా ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశా రు. సిక్కింలో భారీ వర్షాలకు వెయ్యి మంది కి పైగా టూరిస్టులు చిక్కుకుపోయారు.