5 March, 2026 | 4:13 PM

ముగిసిన ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు

21-02-2026 03:09 PM

కాగజ్ నగర్,1(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో  భామనిచేనులో గతవారం రోజులుగా జరుగుతున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు శనివారం ముగిశాయి. గెలుపొందిన జట్లకు  సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పిరిసింగుల తిరుపతి, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.