09-08-2025 04:45:07 PM
కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్ నగర్ లో ఘనంగా ఆదివాసి దినోత్సవాన్ని నిర్వహించారు. శనివారం కాగజ్ నగర్ డాడానగర్ చౌరస్తాలోని కొమరం భీం విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Former MLA Koneru Konappa)తో పాటు, ఆదివాసీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం చేయాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.