27-06-2025 06:31:10 PM
పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనిరెడ్డిగూడెం (మాచారం)కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ సర్పంచ్ గడ్డం లక్ష్మమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. ఈ మేరకు ఆమె 'దశ దిన' కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి విచ్చేసి మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ మండలాద్యక్షులు తూముల సురేష్ రావు, మాజీ జెడ్పిటిసి పిన్నేని కోటేశ్వరరావు, మార్కెట్ డైరెక్టర్ ఆర్తి కేశవులు, అని రెడ్డి వెంకట్ రెడ్డి, గజ్జల సైదిరెడ్డి, సందీప్ రాథోడ్ తదితరులు ఉన్నారు.