18 April, 2026 | 11:26 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

26-03-2025 01:52 AM

కోదాడ, మార్చి25: కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండల పరిధిలోని శాంతినగర్‌బొజ్జగూడెం గ్రామ శివారులో రహదారిపై వాటర్ ట్యాంకర్ ను ఇనోవా కారు ఢీకొన్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్కు చెందిన అమ్మిరెడ్డి పద్మ (32), నంద్యాల ఉపేందర్రెడ్డి,  వేపుల సింగారకు చెందిన సోము కృష్ణారెడ్డి(43) , గోపిరెడ్డి బ్రహ్మ రెడ్డి, ఖమ్మంలో ఒక కార్యక్రమానికి వెళ్లి  తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహానం ఖమ్మంకోదాడ జాతీయ రహదారిపై  లారీ వాటర్ ట్యాంకర్ను  వెనుక నుండి ఢీకొన్నట్లుగా స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో సోము  కృష్ణారెడ్డి, అమ్మిరెడ్డి పద్మలు మృతి చెందగా నంద్యాల ఉపేందర్ రెడ్డి, గోపిరెడ్డి బ్రహ్మరెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి.. మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.