calender_icon.png 20 June, 2025 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

20-06-2025 12:05:05 PM

కాంకేర్: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో(Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (District Reserve Guard), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) సంయుక్త బృందం నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌కు బయలుదేరినప్పుడు చోటేబెథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ కొండపై కాల్పులు జరిగాయని కాంకేర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇందిరా కళ్యాణ్ ఎలెసెలా మీడియాకి తెలిపారు. కోత్రి నదికి అవతలి వైపు నిషేధిత మావోయిస్టు సంస్థ సభ్యులు ఉన్నారనే సమాచారం ఆధారంగా అమతోలా, కల్పర్ గ్రామాల మధ్య ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఇద్దరు మావోయిస్టు మృతదేహలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, అయితే ఆ ప్రాంతంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.