గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి
15-07-2026 01:40 PM
నిజాంసాగర్ జూలై 15(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి శివారులో చోటుచేసుకుంది. మండలంలోని గోరుగల్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు. జుంజురు రమేష్, జుంజురు దినేష్ లు సొంత పనిపై పిట్లంవెల్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






