17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య

19-02-2026 12:00 AM

హుజురాబాద్,ఫిబ్రవరి18: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాసైదాపూర్ మండలం ఆకునూరు గ్రామం లో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక వైపు చెట్టుకు బత్తుల రమేష్ (45) అనే వ్యక్తి ఉరి వేసుకుని బుధవారం ఆత్మహత్య కు పా ల్పడ్డాడు.

రమేష్ తన కూతురు పై చదువుల కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం అప్పులు చేసిన ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం రాత్రి బయటకి వెళ్లి వస్తానని చెప్పిన తన భర్త ఇంటికి రాకపోవడంతో, బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు గాలిస్తుండగా చెట్టుకు ఉరివేసుకొని రమేష్ కనబడడంతో భార్య లక్ష్మి కన్నీరు మున్నీరు గా విలపించింది.

భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామానికి చెందిన రమేష్ గత 20 సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం సైదాపూర్ మండలంరాయికల్ గ్రామానికి వలస వచ్చారు. రాయికల్ గ్రామంలో తన భార్య లక్ష్మి తో కలిసి కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని వెళ్లదీసుకుంటూ వచ్చాడు. చేసినఅప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు వారు తెలిపారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.