15 March, 2026 | 5:14 PM

అనుమతులు లేని ఇసుక టిప్పర్ పట్టివేత

15-03-2026 03:50 PM

పాపన్నపేట: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ను పట్టుకొని ఠాణాకు తరలించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మెదక్ వైపు నుంచి బొడ్మట్ పల్లి వైపు ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్ ఇసుక రవాణా చేస్తుందని నమ్మదగిన సమాచారం రావడంతో ఆదివారం ఉదయం సమయంలో సిబ్బందితో కలిసి వెళ్లి పాపన్నపేట గ్రామ శివారులో ఒక టిప్పర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.