29 April, 2026 | 10:14 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

29-04-2026 08:41 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం  28న మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో చెంగిచర్ల క్రాస్ రోడ్స్ వద్ద ఏవీ ఇన్ఫో ఫ్రైడ్ సమీపంలోని ఓపెన్ గ్రౌండ్‌లో సుమారు 50-55 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు  సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా, మృతుడు సుమారు 5.5 అడుగుల ఎత్తు, తెలుపు రంగు చెక్స్ షర్ట్, బూడిద రంగు ప్యాంట్ ధరించి, గడ్డం ఉందని తెలిపారు.  ఎండ తీవ్రత (సన్ స్ట్రోక్) కారణంగా మరణించి ఉండవచ్చని,ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని,మృతుడి వివరాలు తెలిసిన వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సీఐ శంకరయ్య తెలిపారు.