17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కలెక్టరేట్‌లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ప్రారంభం

29-03-2025 12:23 AM

వనపర్తి టౌన్ మార్చి 28:  సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడిఓసీ)లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.కలెక్టరేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను శుక్రవారం కలెక్టర్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ సత్యనారాయణతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ బ్యాంక్ ద్వారా ప్రతి రోజు నగదు,డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.ఈ అవకాశాన్ని ఉద్యోగులు వినియోగించుకోవాలని తెలిపారు.బ్యాంక్ సిబ్బంది సమయ పాలన పాటిస్తూ మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏవో భాను ప్రకాష్, డిపిఆర్‌ఓ సీతారాం, ఎల్ డి ఎం కౌశల్ కిషోర్ పాండే, ఏ ఎల్ డి ఎం సాయి, బ్రాంచ్ మేనేజర్ సతీష్, ఇతర బ్యాంక్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.