11 May, 2026 | 9:08 PM

మార్పు ఎందుకో కేంద్రం వివరించగలదా?: కేటీఆర్

29-08-2024 11:32 AM

హైదరాబాద్: రాష్ట్రంలో చైనా కంపెనీ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒక సంవత్సరం క్రితం చైనీస్ ఆటోమేకర్ బీవైడీ తెలంగాణలో బిలియన్ డాలర్ల ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనను తిరస్కరించిందని ప్రశ్నించారు. కంపెనీ ఏర్పాటుతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ఊపందుకేనేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కంపెనీ ఏర్పాటు ద్వారా వేలాది ఉద్యోగాలు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. చైనా పెట్టుబడులను దేశంలోకి అనుమతిస్తారని కథనాలు వచ్చినట్లు తెలిపారు. మార్పు ఇప్పుడు ఎందుకో కేంద్రం వివరించగలదా? అని కేటీఆర్ ప్రశ్నించారు.