సత్యమేవ జయతే.. 165 రోజుల తర్వాత మళ్లీ 'ఎక్స్'లో కవిత పోస్ట్
29-08-2024 11:50 AM
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎర్రవల్లికి బయలుదేరారు. మధ్యాహ్నం ఎర్రవల్లిలో కవిత కేసీఆర్ ను కలవనున్నారు. ఢిల్లీ మద్యం కేసులో 5 నెలలకు పైగా జైల్లో ఉన్న కవిత సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ నెల 27న విడుదలయ్యారు. పదిరోజుల తర్వాత అందరికీ అందుబాటులో ఉంటానని కవిత వెల్లడించారు. సహకరించాలని నేతలు, కార్యకర్తలు, అభిమానులను కవిత కోరారు. అటు సత్యమేవ జయతే అని ఎక్స్ వేదికలో కవిత పోస్టు చేశారు. మార్చి 14న ఎక్స్ లో వేదికగా కవిత చివరి పోస్టు చేశారు. మార్చి 15న కవిత అరెస్టు, ఈ నెల 27న బెయిల్ పై బయటకు వచ్చారు. 165 రోజుల తర్వాత మళ్లీ ఎక్స్ వేదికగా కవిత పోస్టు చేశారు.






