కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) కార్యాలయం పేరును సేవతీర్థ్ గా పేరు మారుస్తూ కేబినెట్ ఆమోదించింది. రూ. 1.60 లక్షల కోట్లు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. గడెబెళ్లూరు-మహబూబ్ నగర్ 4 లైన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ. 3,175 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసింది. 80 కిలో మీటర్ల మేర జాతీయ రహదారి నిర్మాణంలో హైదరాబాద్-పనాజీ మధ్య ఆర్థిక కారిడార్ కు ఉపయోగం ఉంది. మహబూబ్ నగర్, నారాయణపేట, రాయచూర్, దేవరకద్ర మక్తల్, హైదరాబాద్ మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఈ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి కానుంది. ఢిల్లీ-అంబాల మధ్య రెండు కొత్త రైల్వేలైన్లు నిర్మించనున్నారు. మూడు కొత్త రైల్వే ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదించింది.
రూ.10,000 కోట్ల కార్పస్తో కూడిన స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ పథకం రెండవ దశను మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్(Union Minister Ashwini Vaishnav) శనివారం తెలిపారు. డీప్ టెక్ స్టార్టప్లు, చిన్న నిధుల ద్వారా ప్రారంభ వృద్ధి దశ స్టార్టప్లు, టెక్ ఆధారిత వినూత్న తయారీ స్టార్టప్లు, సెక్టార్/స్టేజ్ అజ్ఞేయ స్టార్టప్లపై కీలక దృష్టి ఉంటుందన్నారు. డీప్ టెక్, హై-టెక్ తయారీకి నిధులు సమకూర్చే ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులలో అధిక ప్రభుత్వ సహకారంతో సహా కార్యాచరణ వెసులుబాటులు ఉంటాయని కేంద్ర మంత్రి తెలిపారు.




