09-06-2025 01:17:37 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 8 (విజయక్రాంతి): ‘తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ డెన్మార్క్ (టాడ్) అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా నూతనకల్ కు చెందిన గిలకత్తుల ఉపేందర్ గౌడ్ ఎన్నికయ్యారు . టాడ్ 20252027 నూతన కార్యవర్గానికి సంబంధించి ఎన్నికల కమిటీ సభ్యులు రాజు ముచంటుల, చంద్ర శేఖర్ ఇజా శనివారం ఓ ప్రకటన జారీ చేశారు.
అధ్యక్షుడిగా ఉపేందర్ గౌడ్ తో పాటు ఉపాధ్యక్షుడిగా సురేందర్ కేసానీ, కార్యదర్శిగా విజయ్ మోహన్ గోపీ, ఖజాంచిగా ఈశ్వర్ ఎమ్మాడి, సాంకేతిక మేనేజర్గా పవన్ కుమార్ పబ్బా, బాహ్య వ్యవహారాల మేనేజర్గా సతీష్ సామా, ఆస్తి నిర్వహణ మేనేజర్గా రాజ్ కుమార్ కలువల, ప్రజాసంబంధాల మేనేజర్గా రమేష్ వనపర్తి , కార్యవర్గ సభ్యులుగా సులక్షణా చౌధరి కొర్వా, సాయగౌడ్ పడాలా, సాయికృష్ణ రెడ్డి మిల్కా, మహేష్ అలేటి, దయానంద్ గౌడ్ పడాలా, వాసుదేవ్ గౌడ్ బిక్కి, అఖిల్ కర్నాటి, గోకుల్ దేశు, రాజేశ్వర్ నీరడి, శరణ్ యల్కా ఎన్నికయ్యారు.
తెలుగు భాష, సాంస్కృతిక ఉత్సవాలు, కమ్యూనిటీ కలయికకు కేంద్రబిందువుగా ఈ సంఘం పనిచేస్తోందని నూతన కార్యవర్గం వెల్లడించింది. డెన్మార్క్లో నివసించే తెలుగువారికి బంధాన్ని కల్పించే వేదికగా నిలుస్తోందని, సంఘానికి బలమైన సహకారం అందించాలని ఆకాంక్షించింది.