calender_icon.png 9 June, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లు మంజూరైందని పొలం అమ్మేశాడు

09-06-2025 01:19:17 AM

  1. నమ్మించి మోసం చేసిన స్థానిక నాయకులు 
  2. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో
  3. పేరు రాక  పేదోడి  
  4. ఆత్మహత్యాయత్నం
  5. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో  ఘటన 

కామారెడ్డి, జూన్ 8 (విజయ క్రాంతి): ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఇక ఇల్లు నిర్మించుకోవచ్చు, అధికారులు వచ్చి మార్కింగ్ చేస్తారు అని నమ్మించి మోసం చేసిన నాయకులు తీరా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జాబితాలో పేరు రాకపోవడం తో ఓ పేదవాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోర్పోల్ గ్రామంలో జరిగిన సంఘటన ఇది.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఇందిరమ్మ పథకం కింద ఇల్లు మంజూర అయిందని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పడంతో ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే నిధులు సరిపోవని గ్రహించి ఉన్న పొలం అమ్ముకున్నాడు. ఇక సొంత ఇల్లు నిర్మించుకుంటానని ఎన్నో కళలు కన్నాడు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నమ్మించి మోసం చేశారు.

మొదటి జాబితాలోనే పేరు వచ్చిందని కాంగ్రెస్ నాయకులు సమాచారం అందించారు. ఎంతో సంతోషించిన ఆ పేదవాడు సొంత ఇల్లు నిర్మించుకుంటానని భావించి న కోర్పోలు గ్రామానికి చెందిన నర్సని కాశీరామ్  అధికారులు వచ్చి ఇల్లు నిర్మాణానికి మార్కింగ్ చేస్తారు అనుకున్నాడు. స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పడం తో వారు చెప్పిన నమ్మకంతో తన గుడిసెను తొలగించి స్థలం చదును చేయించాడు.

ఇంటి నిర్మాణం సమయంలో డబ్బు ల కు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ముందుగా తనకున్న ఎకరం పొలము లో అర ఎకరం పోలము అమ్మేశాడు. తుది జాబితాలో తన పేరు లేకపోవడంతో శనివారం కలత చెంది ఇంట్లో ఉన్న గడ్డి మందు ను సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కాశీరాము ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం సిరిసిల్ల రాజన్న జిల్లాలోని ఎల్లారెడ్డిపేట  ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న ట్లు గ్రామస్తులు తెలిపారు.