calender_icon.png 9 June, 2025 | 6:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుప్పు పట్టిన విద్యుత్ స్తంభం స్థానంలో కొత్త స్తంభం ఏర్పాటు

09-06-2025 01:16:12 AM

అధికారులకు ధన్యవాదాలు  తెలిపిన -స్థానికుడు మనోజ్ కుమార్ ముదిరాజ్

ఖైరతాబాద్, జూన్ 8 (విజయ క్రాంతి): తుప్పు పట్టి ప్రమాదకరంగా మారిన కరెంట్ స్తంభం స్థానంలో కొత్త కరెంటు స్తంభాన్ని ఏర్పాటు చేసిన విద్యుత్ శాఖ అధికారులకు స్థానికుడు మనోజ్ కుమార్ ముదిరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వివరాల్లోకి వెళితే రాణిగంజ్ గాస్మండి ఏరియాలోని లైబ్రరీ వద్ద గత కొంతకాలంగా విద్యుత్ పోల్ తుప్పు పట్టి చాలా ప్రమాదకంగా మారిందని తెలిపారు.

ఇట్టి పోలు ఎప్పుడు కూలి తమ నివాసాలపై పడుతుందో తెలియక చాలా భయాందోళనలకు గురయ్యా మని అన్నారు. ఇట్టి విషయాన్ని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కోటా నీలిమ దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించిన ఆమె స్థానిక విద్యుత్ అధికారులకు డి ఈ,ఏ డి,ఏ ఈ లకు సూచించడం జరిగిందని తెలిపారు.

దీంతో ఆదివారం పాత తుప్పు పట్టిన స్తంభం ప్లేసులో కొత్త స్తంభాన్ని విద్యుత్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఎస్పీడీసీఎల్ అధికా రులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.