15 April, 2026 | 1:44 PM

Breaking News

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •  

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో రచ్చ

25-11-2025 01:38 PM

కుర్చీల పైకి ఎక్కిన మజ్లిస్, బీజేపీ సభ్యులు

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో(GHMC Council meeting) రచ్చ జరిగింది. మజ్లిస్, బీజేపీ కార్పొరేటర్ల(BJP-AIMIM Corporator) మధ్య తోపులాట చోటుచేసుకుంది. వందేమాతరం, జయజయహే తెలంగాణ గీతాలాపన(Jaya Jayahe Telangana) సమయంలో ఎంఐఎం కార్పొరేటర్ కూర్చొనే ఉన్నారని, నిలబడకుండా అవమానించారంటూ బీజేపీ సభ్యుల అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సమావేశంలో గందరగోళం నెలకొంది. మజ్లిస్, బీజేపీ సభ్యులు ఒకరినొకరు దూషించు కుంటూ కుర్చీల పైకి ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Gadwal Vijayalakshmi) మార్షల్స్ ను రంగంలోకి దింపారు. కార్పొరేటర్లు టేబుల్స్ పైకి ఎక్కడం ఏమ్ మర్యాద అంటూ మేయర్ ఫైర్ అయ్యారు. ఆందోళన చేస్తున్న సభ్యులను బయటకు పంపిస్తానంటూ మేయర్ హెచ్చరించారు. కౌన్సిల్ సమావేశానికి అందరూ సహకరించాలని కోరారు.