30-05-2025 01:24:01 AM
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల, మే 29 (విజయక్రాంతి): మౌలిక సదుపాయాల కల్పనతోనే పట్టణం అభివృద్ధి చెందుతుందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా అధిక నిధులు వెచ్చించి జగిత్యాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల 7, 8 వార్డుల్లో రూ. 25 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు గురువారం ఆయన భూమి పూజ చేశా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియని, జగిత్యాల పట్టణాన్ని గతంలో కన్నా రెట్టింపు నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రణాళిక ప్రకారం చట్టబద్దమైన అనుమతులతో నిర్మాణాలు చేపట్టాలని ప్రజలను కోరారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారానే పట్టణం అభివృద్ధి చెందుతుందని, జిల్లాగా ఏర్పడ్డ తర్వాత పట్టణం నలువైపులా విస్తరించడం జరిగిందన్నారు.
చుట్టు పక్కల పరిసర గ్రామాల శివారు ప్రాంతాలు పట్టణంలో కలపడం జరిగిందన్నారు. పట్టణ పరిశుభ్రత, అభివృద్ధి విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఎ మ్మెల్యే స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో నుండి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పడ్డాక జగిత్యాలకు అత్యధిక నిధులు మంజూరయ్యాయని, అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ స్పందన, ము న్సిపల్ మాజీ చైర్మన్లు అడువాల జ్యోతి లక్ష్మణ్, గిరి నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు మల్లవ్వ, తిరుమలయ్య, రేణుక మొగిలి, మాజీ కో ఆప్షన్ సభ్యులు శ్రీనివాస్, డిఈ నాగేశ్వర్, ఏఈ అనిల్, మెప్మా ఏవో శ్రీనివాస్, పలువురు నాయకులు పాల్గొన్నారు.