14 July, 2026 | 4:15 PM

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్

14-07-2026 03:41 PM

హైదరాబాద్: అయోధ్యలో(Ayodhya Ram Temple Theft) అవినీతి జరుగుతుంటే స్వామీజీలు ఎందుకు మాట్లాడరు? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) ప్రశ్నించారు. అయోధ్యలో అవినీతిని నిరసిస్తూ ఈ నెల 23న  ఢిల్లీ జంతర్ మంతర్(Delhi Jantar Mantar) వద్ద మౌనదీక్ష చేస్తానని వి. హనమంతరావు సూచించారు. అయోధ్యలో ఇంత జరుగుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా స్పందించరెందుకు? అని ప్రశ్నించారు. అయోధ్యలో చోరీపై సీబీఐ విచారణ(CBI inquiry) చేసి.. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు ఓట్, సీట్ చోరీ.. ఇప్పుడు రాముడి సొమ్ము చోరీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.