సుధాకర్ కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు
గుండాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని రోళ్లగడ్డ గ్రామపంచాయతీ నర్సాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దుగ్గి సుధాకర్ కొద్దిరోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ కారణం మృతి చెందడంతో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ లు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి, దశదిన కర్మలకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఊకే బుచ్చయ్య, రోళ్లగడ్డ సర్పంచ్ భూక్య మంగమ్మ, ఎస్సీ సెల్ అధ్యక్షులు గుర్రం పుష్పరాజ్, వార్డు మెంబర్ గుగులోత్ బద్రు, నాయకులు మోకాళ్ళ శంకర్, వాంకుడోత్ రమేష్, భూక్య శ్రీను, బొర్రా వెంకటేశ్వర్లు, నూనావత్ రవి, సనప సీతారాములు, సనప గోవింద్, ఎస్కే ఇస్రార్, పల్లపు రాజేష్, గడ్డం రాజేష్, బొంగు చంద్రశేఖర్, మాలోత్ కళ్యాణ్, సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






