టెన్త్ ఫలితాల్లో వసంత్ వ్యాలీ ప్రభంజనం
30-04-2026 12:26 AM
కరీంనగర్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కరీంనగర్ హనుమాన్ నగర్ లోని వసంత్ వ్యాలీ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. బి. రామ్ చరణ్ 578 మార్కులు, వి.వర్షిత 574 మార్కులు, ఏం సౌమ్య 570 మార్కులు సాధించారు. టి రమ్యశ్రీ 570 మార్కులు రాగా, కే ,రిత్విక 570 మార్కులు సాధించి ప్రభంజనం సృష్టించారు. 5 గురు విద్యార్థులకు 570 మార్కులు పైబడి రాగా, 550 మార్కులు ల పైబడి 15 మంది విద్యార్థులు సాధించారు.70 మంది విద్యార్థులకు 500 మార్కులు సాధించి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు,వంద శాతం విద్యార్థులు ఫలితాలు సాధించడంతో వసంత్ వ్యాలీ పాఠశాల చైర్మన్ ఏ, బుచ్చిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.






