15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గోదావరి నదికి హారతి నిర్వహించిన వేద పండితులు

12-04-2025 11:15 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): దక్షిణ కాశిగా పేరుపొందిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో గోదావరి నదికి హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం వారి ఆధ్వర్యంలో ప్రతి పౌర్ణమికి గోదావరి నదికి హారతి కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమీషనర్, హైదరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి నెల పౌర్ణమి రోజున గోదావరి నదీకి హారతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈవో మహేష్ తెలిపారు. శనివారం ప్రధాన అర్చకులు టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చక స్వాములు దేవాలయం నుండి మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో, గోదావరి నది వద్దకు వెల్లి గోదావరి నదికి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది, గ్రామస్తులు, భక్తులు, మహిళలు, సేవాసమితి సభ్యులు పాల్గొన్నారు.