02-06-2025 03:06:01 PM
హమీర్పూర్: నారాయణ్పూర్ గ్రామం(Narayanpur village) సమీపంలో వివాహ ఊరేగింపు వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని పోలీసులు సోమవారం తెలిపారు. కల్పి నుండి సుమేర్పూర్లోని దేవ్గావ్కు వెళ్తున్న వివాహ ఊరేగింపులో భాగంగా గుర్తు తెలియని వాహనం కారును ఢీకొట్టడంతో ఈ సంఘటన తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగింది.
ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే శోభిత్ (11), సౌరభ్ పాల్ (23) అక్కడికక్కడే మరణించినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి పంపామని, గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నామని సుమేర్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అనుప్ సింగ్(Sumerpur Police Station Inspector Anup Singh) తెలిపారు. ప్రస్తుతం గుర్తు తెలియని వాహనాన్ని గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.