21 March, 2026 | 6:38 PM

Breaking News

వృక్షారోపణకు సేవ చేస్తున్న వెంకన్నకు పూర్వ కలెక్టర్ నుంచి సహాయం

21-03-2026 05:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణ పరిధిలోని శ్రీనివాస గుట్ట వద్ద వృక్షారోపణకు విశేషంగా కృషి చేస్తున్న పిట్టల వెంకన్నకి, పూర్వ జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ బదిలీపై వెళ్లే సందర్భంలో తమ సొంత నిధుల నుంచి రూ.10,000/- ఆర్థిక సహాయం అందించారు. ఆ మొత్తాన్ని శుక్రవారం పిట్టల వెంకన్న  అందజేశారు.

పాండురంగపురం గ్రామానికి చెందిన పిట్టల వెంకన్న  పాల్వంచలోని శ్రీనివాస గుట్టపై భక్తులకు సేవగా అనేక వృక్షాలను నాటి సంరక్షిస్తున్నారు. గుట్టకు వచ్చే భక్తులకు మొక్కలు అందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పించారు. ఈ నర్సరీ ఏర్పాటుకు అవసరమైన మొక్కల కొనుగోలు, పెంపకం, తోటపని పరికరాలు, కొమ్మల ద్వారా పెంచే మొక్కలు కోసం ప్రోత్సాహకంగా ఈ సహాయం అందజేశారు.